Thursday, May 2, 2024

Demand Action – “మండ‌లి ఓ ఇరానీ కేఫ్” ….రేవంత్ వ్యాఖ్యల‌పై ఎమ్మెల్సీలు ఫైర్…

హైద‌రాబాద్ – ఒక టివి ఛాన‌ల్ ల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శాసన మండలిని ఇరానీ కేఫ్‌గా, సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా పేర్కొన‌డంప బిఆర్ఎస్ ఎమ్మ‌ల్సీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.. పెద్ద‌ల స‌భ‌ను విధంగా పోల్చ‌డంపై మండిప‌డుతున్నారు.. ఈ వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీలు కౌన్సిల్ చైర్మన్‌కి ఈ రోజు వినతిపత్రం అందజేశారు. శాసన మండలిపైనా, అందులోని స‌భ్యులు పైనా వ్యాఖ్యలు చేసిన సీఎం పై కఠిన చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని కోరారు.. మండ‌లి ఛైర్మ‌న్ ను క‌లిసిన వారిలో ఎమ్మెల్సీలు ఎం. ఎస్. ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్ ,సురభి వాణి దేవి త‌దిత‌రులున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement