Saturday, May 4, 2024

TS : ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం…

ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ‌ సాయంత్రం సమావేశం కానుంది. కాంగ్రెస్ పార్టీ 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఇవాళ మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు.

- Advertisement -

వారి వెంట తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ వెళ్లనున్నారు. పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది. పోటీ ఎక్కువగా ఉండడంతో నేడు అధికారులతో చర్చించి పేర్లను ఖరారు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement