Friday, April 26, 2024

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

సంగెం, (ప్రభ న్యూస్): మండలంలోని అశాలపల్లి గ్రామానికి చెందిన దండు సమ్మయ్య (46)అను వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం… మృతుడు తనకున్న మూడు ఎకరాల వ్యవసాయ భూమిలో గత మూడు సంవత్సరాల నుండి పంట సరిగా పండనందున అప్పులు చేసి ఇటీవల 10 గుంటలు భూమి అమ్మిన ఇంకా 3 లక్షలు అప్పులు మిగిలి ఉన్నందున అప్పులు తీర్చడం ఎలా అనే మానసిక బాధతో, గత నెల 24వ తేదీన గడ్డి మందు త్రాగడంతో, ఇరుగు పొరుగు వారు చూసి చికిత్స నిమిత్తం ఎంజీఎం హాస్పటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం 7 గంటలకు చనిపోయాడని తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతుని భార్య మంజుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై డి.హరిత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement