Thursday, April 25, 2024

ఢిల్లీ కాలుష్యానికి పాక్ కార‌ణమా..?

ప్ర‌భన్యూస్: ఢిల్లి కాలుష్యం విషయంలో ఉత్తర్‌ప్రదేశ్‌ పాత్ర లేదని ఆ రాష్ట్రం సుప్రీం కోర్టులో వాదనలు వినిపించింది. పాకిస్తాన్‌ నుంచి వస్తోన్న వాయు కాలుష్యం ఢిల్లి పరిస్థితికి కారణమని వాదించింది. దీనిపై సుప్రీం కోర్టు స్పందిస్తూ.. మేం పాకిస్తాన్‌ పరిశ్రమలపై నిషేధం విధించాలని మీరు కోరుకుంటున్నారా..? అని ఆ రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దేశ రాజధాని ఢిల్లి వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుపోయింది. దాంతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.

ఈ మేరకు సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. అలాగే టాస్క్‌ఫోర్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు ప్రత్యేక అధికారాలు ఇచ్చినట్టు వెల్లడించింది. స్కూళ్ల మూసివేతపై వచ్చిన వార్తలపై సీజేఐ ఎన్‌వీ రమణ స్పందిస్తూ.. ఢిల్లిలో నిరవధికంగా పాఠశాలలు మూసివేయాలని ఆదేశించలేదన్నారు. కాలుష్యస్థాయిలు అధికంగా ఉన్న సమయంలో పెద్దలు ఇంటి నుంచి పని చేస్తుంటే.. పిల్లలు పాఠశాలకు వెళ్లడం మాత్రమే ప్రశ్నించామన్నారు. కానీ ఈ విషయంపై కొన్ని మీడియా సంస్థలు.. తమను విలన్లుగా చిత్రీకరిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమం గురించి పట్టదని ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement