Wednesday, May 1, 2024

రాజేంద్రనగర్ లో దారుణం.. కన్న తల్లిని చంపిన కూతురు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసింది ఓ కూతురు. రాజేంద్రనగర్‌ పరిధిలో నివాసముండే యాదమ్మ, యాదయ్యల చిన్న కుమార్తె.. ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయంపై తల్లి తీవ్రంగా మందలించింది. దీంతో సోమవారం కూతురు.. ప్రియుడితో కలిసి యాదమ్మకు ఉరి వేసి హత్య చేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. మృత దేహాన్ని ఉస్మానియాకు తరలించారు. ఘనటపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: దళిత బంధుకు రూ.250 కోట్లు.. మరో నాలుగు మండలాల్లో అమలు

Advertisement

తాజా వార్తలు

Advertisement