Friday, May 17, 2024

తెలంగాణలోని అన్ని దేవాల‌యాల్లో ద‌ర్శ‌నాలు ర‌ద్దు..

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధించిన పది రోజుల పాటు అన్ని దేవాలయాల్లో దర్శనాలను సైతం రద్దు చేస్తూ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి తెలంగాణలోని ఆలయాల్లో భక్తుల దర్శనాలు రద్దు చేశారు. ఈ నెల 21 వరకు దర్శనాలు నిలిపివేస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిత్య కైంకర్యాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement