Sunday, April 28, 2024

గిరిజనులతో కలిసి నృత్యం చేసిన.. ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్

ప్రభన్యూస్ ప్రతినిధి,భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనిలో రూ. 2 కోట్లతో నిర్మించనున్న గిరిజన భవనానికి గిరిజన దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బంజారా డిజే పాటలకు గిరిజన మహిళలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ లు, ప్రజాప్రతినిధులు ఆనందోత్సహాలతో నృత్యాలు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement