దుగ్గొండి, ప్రభన్యూస్: ఇటీ-వల విడుదలై ఎంతో ప్రజాదరణ పొందుతున్న తెలంగాణ సినిమా బలగంలో కుటుంబ సభ్యుల ఆత్మీయతను చాటి చెప్పే చివరి ఎమోషనల్ పాట పాడి అందరి హృదయాలు గెలుచుకున్న దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగ జంగాల కళాకారులు పస్తం మొగిలయ్యకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దళిత బంధు పథకాన్ని మంజూరు చేయించారు. తమ కల ద్వారా ఎంతో ప్రతిభను కనబరిచిన మొగిలయ్య దంపతులను ఇటీ-వల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని వారి యోగక్షేమాల గూర్చి అడిగి తెలుసుకుని, వారి ప్రతిభను అభినందిస్తూ సన్మానించారు. మొగిలయ్య కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని వివరించగా వెంటనే స్పందించి నిమ్స్ హాస్పటల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక కృషి చేశారు. ఆ కుటు-ంబానికి చేయూతనందించాలని నిర్ణయించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నతాధి కారులతో మాట్లాడి వెంటనే వారికి దళిత బంధు పథకాన్ని మంజూరు చేయించారు. నమ్ముకున్న కలనే జీవనాధారంగా బ్రతుకు సాగిస్తున్న మొగిలయ్య ఆరో గ్యం త్వరగా మెరుగుపడి కోలుకోవాలని కోరుతూ వారి హెల్త్ కండిషన్ గురించి నిమ్స్ వైద్యులతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధ పడుతున్న మొగిలయ్యకు చికిత్స చేయించడంతోపాటు- దళిత బంధును కూడా మంజూరు చేయించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఈ సందర్భంగా బలగం మొగిలయ్య దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement