Thursday, May 9, 2024

Corrupted – మర్రిగూడ తాహశీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఎసిబి దాడి.. కోట్ల‌లో న‌గ‌దు, నాలుగు కిలోల బంగారం స్వాధీనం

నల్గొండ – ఎపిబికి అవినీతి తిమింగ‌లం చిక్కింది.. జిల్లా మర్రిగూడ తాహశీల్దార్ మహేందర్ రెడ్డి నివాసం,బంధువుల ఇళ్ళపై అవినీతి నిరోధక శాఖ నేడు మెరుపు దాడులు నిర్వ‌హించింది. ఈ సంద‌ర్బంగా ఇంట్లో ట్రంకు పెట్టెలో దాచిన రెండు కోట్ల నగదు . నాలుగు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.. బంగారం విలువ‌ను మ‌దింపు చేస్తున్నారు.. అలాగే కోట్ల రూపాయల విలువైన ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూముల డాక్యుమెంట్లను గుర్తించారు.. వాటిని సీజ్ చేశారు.. ప్ర‌స్తుతం ఆయ‌న నివాసంలోనూ, బంధువుల ఇళ్ల‌లోనే సోదాలు కొన‌సాగుతున్నాయి.. ఈ సోదాలు సాయంత్రం వ‌ర‌కు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు. దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement