Friday, May 3, 2024

TS: మహేశ్వరంలో పలు కార్యక్రమాలకు మంత్రుల శంకుస్థాపనలు

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : రాష్ట్ర మంత్రులు సబతా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు మహేశ్వరంలో పర్యటిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తూ మంత్రులు సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డితో కలిసి పలు కార్యక్రమాలకు విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి శ్రీకారం చుట్టారు.

మహేశ్వరంలో రూ.69లక్షలతో నిర్మించిన మార్కెట్ షెడ్, దుకాణ సముదాయాన్ని ప్రారంభించారు. ఉప్పుగడ్డ తండాలో రూ.4 కోట్ల 20లక్షలతో నిర్మించిన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలలను ప్రారంభించారు. కోటి రూపాయలతో నిర్మించే బంజారా భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కోటి రూపాయలతో నిర్మించే సేవాలాల్ మహరాజ్ దేవాలయ మండపం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ముదిరాజ్, యాదవ, కురుమ, మెదరి, ముస్లిం, గౌడ, దాసరి, బైండ్ల, ఎరుకల కుల సంఘాలకు సంభందించి 9 భవన నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement