Friday, May 3, 2024

తెలంగాణ‌లో 484కు పెరిగిన కరోనా కేసులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతోన్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 494 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు సైతం 1.71 శాతానికి పెరిగింది. హైదరాబాద్‌ జిల్లాలో 315 కేసులు నమోదయ్యాయి. గురువారం నమోదైన కేసుల్లో 90 శాతం కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య మూడు వేలు దాటింది.

అత్యధికంగా హైదరాబాద్‌లో 315, రంగారెడ్డిలో 102, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 31, సంగారెడ్డిలో 11 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌, శానిటైజర్‌, భౌతిక దూరం తదితర కోవిద్‌ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement