Monday, May 6, 2024

TS : మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లు ఢీ… త‌ప్పిన ప్ర‌మాదం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణ భవన్ నుంచి మిర్యాలగూడకు బయలుదేరారు. మార్గ మధ్యలో ప్రజలను పలుకరించుకుంటూ వెళ్లారు. అయితే వేములపల్లి వద్దకు చేరుకోగానే కాన్వాయ్ ఒకదానికొకటి ఢీ కొన్నాయి.

దీంతో పది వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. స్వల్పంగా వాహనాలు ధ్వంసం అయ్యాయి. కేసీఆర్ కాన్వాయ్ వాహనాల్లో ఉన్న వారికి ముప్పు తప్పింది. మరికొద్ది సేపట్లో మిర్యాలగూడకు చేరుకొని రోడ్డు షోలో పాల్గొననున్నారు మాజీ సీఎం కేసీఆర్. అక్కడి నుంచి బస్సు యాత్రలో సూర్యపేట వరకు కొనసాగనుంది. ఇవాళ రాత్రి సూర్యపేటలోనే ఉండనున్నారు కేసీఆర్.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement