Thursday, April 25, 2024

Rangareddy : విజయోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం

వికారాబాద్, జూన్ 5 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ విజయోత్సవం కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్ పక్కన జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామిరెడ్డి కూర్చోవడంతో తనకు సీటు కేటాయించాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగులపల్లి మంజుల రమేష్ కలెక్టర్ ను కోరారు. జిల్లా రైతు సమితి అధ్యక్షునిగా ఉన్న రామిరెడ్డిని అప్పుడే వచ్చిన మున్సిపల్ చైర్ పర్సన్ చిగులపల్లి మంజుల రమేష్ తనకు సీటు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి తెచ్చారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ ఎమ్మెల్యే పక్కన కూర్చోవాలని సూచించడంతో వివాదం సద్దుమణిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement