Wednesday, May 1, 2024

రేపు రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ.. రాజకీయాల‌కు అతీతంగా పాల్గొనాలే

తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఉద్యమించిన తరహాలోనే.. రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం తెలిపారు. ఈ నెల 11న కరీంనగర్ లో భారీ ర్యాలీ నిర్వహించబన్నట్టు ఆయ‌న చెప్పారు. భారత జాతిని అవమనపరిచేలా బీజేపీ లీడ‌ర్లు మాట్లాడుతున్నారని, కేంద్ర మాజీ మంత్రి ఒకరు కాషాయం జెండాను జాతీయ జెండగా మార్చుతామని ప్రకటించారంటే రాజ్యాంగం పట్ల వారికి ఏవిధమైన గౌరవం ఉందొ అర్ధం అవుతుందన్నారు.

రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, అప‌హాస్యం చేసేలా కొంత‌మంది బీజేపీ లీడ‌ర్లు మాట్లాడుతున్నార‌ని కాంతం అన్నారుం. మతం పేరుతొ రాజకీయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి నిరసన‌గా ఈ ర్యాలీ నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. దీనికి అన్ని కులాలు, మతాల ప్రజలు, నాయకులు రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొంటార‌ని కాంతం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement