Monday, May 6, 2024

కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి భారీగా చేరికలు

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలంలోని నిర్మాలలో పలువురు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య కార్యకర్తలు వారధిలా పని చేయాలన్నారు. పార్టీ కార్యకర్తలను అధినేత కేసిఆర్ కంటికి రెప్పలా కాపాడే బాధ్యత తనదని మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement