Wednesday, May 1, 2024

ఎమ్మెల్యే నీకిది త‌గునా .. కాంగ్రెస్ నేత ఆంజనేయులు గౌడ్…..

నర్సాపూర్ జులై 17 (ప్రభ న్యూస్) టి పి సి సి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నాయకులు దొంగలు అని స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి విమర్శించడం సరికాదని టి పి సి సి రాష్ట్ర నాయకులు ఆంజనేయులు గౌడ్ అన్నారు సోమవారం నర్సాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి 9 సంవత్సరాల పాలనలో నర్సాపూర్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు అభివృద్ధి చేయలేని ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులను విమర్శించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు .

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నె ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎ ఒక్క హామీలు కూడా సక్రమంగా అమలుపరచలేదని అన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావులు టి పి సి సి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై లేనిపోని ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు ఇకముందు రేవంత్ రెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేస్తే ఖబర్దార్ అని ఆయన హెచ్చరించారు టి పి సి సి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులకు స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి కార్యక్రమాలను అడ్డుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గుప్తా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్ ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు అశోక్ గౌడ్ నాయకులు సురేష్ నాయక్ ఉదయ్ కుమార్ నరసింహ చారి రాధాకృష్ణ రషీద్ శ్రీశైలం యాదవ్ దేవి సింగ్ రవిశంకర్ వీరేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement