Thursday, May 2, 2024

బీసీ బంధు అమలు చేయండి: వీహెచ్

తెలంగాణలో దళిత బంధు ప్రవేశపెట్టినట్లే బీసీ బంధు పథకాన్ని కూడా అమలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. బీసీలను విస్మరిస్తే టీఆర్ఎస్‌కు హుజురాబాద్‌లో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీసీ బంధు కోసం రాష్ట్రవ్యాప్త పోరాటం చేస్తామని వీహెచ్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ  ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో ఈబీసీ బిల్లు  ప్రవేశ పెట్టారని చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులో కొత్తదనం ఏమీలేదని పేర్కొన్నారు. బీజేపీకి దమ్ముంటే కులాల వారీగా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement