Monday, April 29, 2024

ఈటలపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తోడేళ్ల దాడిని తప్పించుకోవడానికే ఈటల ఢిల్లీ వెళ్లారని దాసోజు శ్రవణ్ అన్నారు. ఈటలపై పోలీసు, రెవెన్యూ అధికారులతో ఒత్తిడి పెంచారని ఆరోపించారు. ఒత్తిడి తప్పించుకోవడానికి ఈటల ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఆధిపత్యం కోసం ఈటలతో పాటు.. ఆయన భార్య జమున, కొడుకు, కోడలు పై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీకాదు, ఫక్తు ఫాల్తూ పార్టీగా మారిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసినవాళ్ళు మంత్రులయ్యారని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ నుంచి తప్పించుకోవడానికి ఈటల బీజేపీ వైపు చూస్తున్నారని దాసోజు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement