Thursday, May 16, 2024

TS : హ‌స్తం గూటికి ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి, కూతురు కావ్య‌

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో వారు కాంగ్రెస్‌లో చేరారు. శ్రీహరి, కావ్యలకు దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఆయన కుమార్తె కడియం కావ్యతో కలిసి ఆదివారం ఉదయం సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కావ్య పేరును ప్రకటించే అవకాశం ఉంది. కడియం శ్రీహరి, కావ్యలు శనివారమే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. అయితే, శ్రీహరి తన నియోజకవర్గంలో ఆయన వర్గీయులతో సమావేశం అయ్యారు.

- Advertisement -

సమావేశం ఆలస్యం కావటంతో సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చిన సమయానికి చేరుకోలేక పోయారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి సచివాలయంలో పలు సమీక్షల్లో పాల్గొన్నారు. దీంతో శనివారం కడియం శ్రీహరి, ఆమె కుతురు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆదివారం ఉదయమే రేవంత్ నివాసానికి చేరుకున్న కడియం శ్రీహరి, కావ్యలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దీపాదాస్ మున్షీ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement