Monday, April 29, 2024

Congress Campaign – నేడు రాహుల్ గాంధీ విజయభేరి బస్సు యాత్ర షెడ్యుల్…

భూపాలపల్లి – తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో రాహుల్ గాంధీ మూడు రోజులు బస్సు యాత్రలో భాగంగా రెండో రోజైన ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మీదుగా విజయభేరి బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మేడిపల్లి వద్ద పార్టీ శ్రేణులు స్వాగతం పలకనున్నారు. బైక్ ర్యాలీ ద్వార కాటారం సెంటర్ కి రాహుల్‌ గాంధీ చేరుకొనున్నారు. కాటారం సెంటర్ లో సభలో రాహూల్ గాంధీ ప్రసంగించనున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కే.టి.పీ.పీ గోదావరి గెస్ట్ హౌస్ లో నేడు రేవూరి ప్రకాష్ రెడ్డి తో పాటు మరికొంతమంది రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అనంతరం బస్సు యాత్ర కేటీకే 5వ గని నుండి బాంబులగడ్డ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. కేటికే 1.వ గని వద్ద సింగరేణి కార్మికులతో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గేట్ మీటింగ్ నిర్వహించనున్నారు. అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడానున్నారు. సింగరేణి ఒకటో గని గేట్ మీటింగ్ కి రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంతో చర్చనీయాంశంగా మారింది. కాగా పీసీసీ చీఫ్ రేవంత్., భట్టి లకు మాత్రమే సింగరేణి ఒకటో గని గేట్ మీటింగ్ కు అనుమతి ఇవ్వడంతో సింగరేణి కార్మికులతో రేవంత్‌, భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటి మాట్లాడనున్నారు.

నేటి షెడ్యూల్..

- Advertisement -

19వ తేదీన భూపాలపల్లి నుంచి కాటారం కి చేరుకోనున్న బస్సు యాత్ర

కాటారం పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు పీసీసీ రేవంత్ రెడ్డి,. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

మంథని నుంచి పెద్దపల్లి వెళ్లనున్న బస్సు యాత్ర

పెద్దపల్లి నుంచి కరీంనగర్ కు బస్సు యాత్ర.

కరీంనగర్ లో నైట్ హాల్ట్ చేయనున్న రాహుల్ గాంధీ

Advertisement

తాజా వార్తలు

Advertisement