Thursday, May 2, 2024

Congress Campaign – బీఆర్ఎస్, బీజేపీ కుయుక్తులను తిప్పి కొట్టాలి – గిడుగు రుద్రరాజు

ముషీరాబాద్/ (.ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ… ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీ ఆర్ ఎస్ తో పాటు దానికి లోపాయకారిగా సహకరిస్తున్న బీజేపీ కుయుక్తులను తిప్పి కొట్టాలని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పిలుపు నిచ్చారు. తెలంగాణ లోని ముషీరాబాద్ నియోజకవర్గoలో కాంగ్రెస్ అభ్యర్ధి అంజని కుమార్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ… కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధి రామయ్య, సి డబ్ల్యూ సి సభ్యులు డాక్టర్ ఎన్. రఘువీరా రెడ్డితో కలసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కర్ణాటకలో కొలువు దీరిన సిద్ది రామయ్య ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తుందని, అదేవిధంగా తెలంగాణ లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత ప్రజలకు అసలైన సంక్షేమ, అభివృద్ధి పాలన అందిస్తామని ఆయన అన్నారు.

దీనిని ఓర్వలేని బీ ఆర్ ఎస్, బీజేపీ, ఎమ్ఐఎం నేతలు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి… కర్ణాటక ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు, ప్రచారం చేస్తున్నారు అని మండి పడ్డారు. ప్రజల కోసం ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే… కెసిఆర్ కుటుంబం.. దొరల పాలనతో సామాన్యులకు బంగారు తెలంగాణాను దూరం చేసింది అన్నారు. అన్ని వర్గాలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, దళిత, మైనార్టీ, మహిళలకు మేలు జరగాలంటే… తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. హైద్రాబాద్ నగరంలో ఎంతో కీలకమైన ముషీరాబాద్ నియోజకవర్గoలో హస్తం గుర్తుకు ఓటేసి.. అంజని కుమార్ యాదవ్ ని గెలిపించాలని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఏఐసీసీ, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement