Sunday, April 28, 2024

TS : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ విద్యార్థుల ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి, ప్ర‌భ‌న్యూస్ః భద్రాద్రి కొత్తగూడెంలోని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు వేధింపులను నిరసిస్తూ 300 వందల మంది విద్యార్థులు కళాశాల ఎదుట సోమవారం మధ్యాహ్నం ఆందోళన కు దిగారు. విద్యార్థులు ఉండే హాస్టల్ కు ప్రిన్సిపాల్ తో పాటు సిబ్బంది రాత్రి పూట వెళ్లి విద్యార్థుల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నట్లు విద్యార్థులు ఆరోపించారు.

- Advertisement -

అదే విధంగా కళాశాల హాస్టల్ లో త్రాగునీరు, భోజనం అస్తవ్యస్తంగా ఉందన్నారు.తమకు సౌకర్యాలు కల్పించకుండా నిబంధనల పేరుతో తీవ్రంగా వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement