Sunday, April 28, 2024

President murmu: తేనేటీ విందుకు రండీ… స‌ర్పంచ్ దంప‌తుల‌కు ఆహ్వానం…

రాష్ట్రపతి నివాసంలో జరిగే తేనీటి విందుకు స‌ర్పంచ్ దంప‌తుల‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆహ్వానం పంపింది. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల బీఆర్ఎస్ సర్పంచ్ చిత్ర స్వరూపారాణి, భూపాల్‌రెడ్డి దంపతులకు ఎర్రకోట వద్ద జరిగే వేడుకల్లో పాల్గొనాల‌ని ఆహ్వానం అందింది.

గ్రామంలో జలవనరుల అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినందుకు గాను నిరుడు ఏప్రిల్ 17న రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ స్థాయి అవార్డును అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో తీసుకున్నారు. గత ఏడాది వివిధ విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 46 జాతీయ అవార్డుల్లో జల వనరుల అభివృద్ధిపై జాతీయ స్థాయి అవార్డు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement