Tuesday, April 30, 2024

11న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌.. మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ భేటీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈ నెల 11న ధరణి సమస్యలపై కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15నుంచి రాష్ట్రంలో రెవెన్యూ సదస్సుల నిర్వహించాలన్న సర్కార్‌ యోచన నేపథ్యంలో తొలుత ఆయా అంశాలపై చర్చించేందుకు కలెక్టర్లతో సమావేశం కావాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ చర్చించనున్నారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో జరిగే కాన్ఫరెన్సుకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు 11న ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌కు చేరుకోవాలని ప్రభుత్వం సమాచారం అందించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement