Monday, May 6, 2024

TS: మ‌హిళ క్రికెట‌ర్ల‌తో కోచ్ అస‌భ్య‌ప్ర‌వ‌ర్త‌న‌…. జై సింహాపై చ‌ర్య‌లేవంటూ ఆగ్ర‌హం…

అనేక రంగాల్లో మ‌హిళ‌ల పై అస‌భ్యప్ర‌వ‌ర్త‌న‌లు ఎక్కువ‌వుతున్నాయి. రంగం ఏదైనా కానీ వేధింపులు, వారి ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తూనే ఉన్నారు. మ‌హిళ‌ల‌తో ఎంతో మ‌ర్యాదగా ఉండాల్సిన వారే దారి త‌ప్పుతున్నారు. మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డం మ‌న సంప్ర‌దాయం అని వాక్కులు చెబుతుంటాం.. కానీ వాటి ఆచ‌రించడంలో మాత్రం శూన్యం. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. మ‌హిళ క్రికెటర్ల‌కు క్రీడా నైపుణ్యాలు నేర్పించాల్సిన కోచ్ దారి త‌ప్పాడు.మహిళ క్రికెటర్లతో అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడు.

- Advertisement -

మహిళ క్రికెటర్లను బస్సులో తీసుకెళ్తూ కోచ్ జైసింహా మద్యం సేవిస్తూ అసభ్యకరంగా మాట్లాడాడు జైసింహా. అయితే…జైసింహాకు అడ్డు చెప్పకుండా ఎంకరేజ్ చేశాడు పూరిమ రావు. నాలుగు రోజుల కిందట హైదరాబాద్ నుంచి విజయవాడ కు మ్యాచ్ ఆడేందుకు వెళ్ళింది విమెన్స్ క్రికెట్‌ టీమ్.

అయితే..రిటర్న్ లో ఫ్లైట్ కి రావాల్సి ఉండగా… కావాలనే డిలే చేశాడు కోచ్ జైసింహా. దీంతో వారందరూ బస్సులో వచ్చారు. ఇక బస్సులో మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవించిన జై సింహా..వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పూర్ణిమ రావుతో జై సింహాలపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశాడు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు మహిళా క్రికెటర్లు. ఫిర్యాదు చేసి నాలుగు రోజులు అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళా క్రికెటర్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement