Monday, April 29, 2024

TS: సీఎం రేవంత్‌కు బీజేపీతో కాదు.. కాంగ్రెస్‌తోనే ప్రమాదం: కిషన్ రెడ్డి

తనను పదవి నుండి తప్పించేందుకు కుట్ర జరుగుతోందంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కుట్ర వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. ఇవాళ‌ ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీతో ఎలాంటి అపాయం లేదని.. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రమాదం పొంచి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేం ఎలాంటి డిస్టబెన్స్ చేయమని స్పష్టం చేశారు. ఐదేళ్ల తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ‌మే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో భారీ మెజార్టీతో మోడీ ప్రభుత్వం మరోసారి ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement