Thursday, May 2, 2024

రేపు మరోసారి వాసాలమర్రికి సీఎం కేసీఆర్‌..

సీఎం కేసీఆర్ మరోసారి వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. నిన్ననే నల్గొండ జిల్లా హాలియాలో పర్యటించిన సీఎం కేసీఆర్ రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాల మర్రిలో ప్రర్యటించనున్నారు. ఇటీవల వాసాలమర్రిలో గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మరో 20సార్లు అయినా వాసాలమర్రికి వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రేపు గ్రామాన్ని సందర్శించనున్నారు. ఇంతకు ముందు జూలై 9న గ్రామ పర్యటనకు సిద్ధమైనా.. వాయిదా పడింది. సీఎం గ్రామంలోని దళితవాడలో పర్యటించడంతోపాటు రైతువేదికలో 130 మందితో సమావేశం కానున్నారు. గ్రామానికి సీఎం కేసీఆర్‌ రానున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమవగా.. గ్రామంలో సందడి వాతావరణం నెలకొన్నది.

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement