Friday, April 26, 2024

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా మొత్తం ఐదు రోజుల పాటు హస్తినలో మకాం వేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఎల్లుండి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత పార్టీ జాతీయ విధానం, జాతీయ కార్యవర్గం, కమిటీలపై కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు. ఈ క్రమంలో సీఎం భద్రత ఏర్పాట్లతో పాటు కార్యాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement