Wednesday, May 1, 2024

రాయలసీమ ఎత్తిపోతల పై కెసిఆర్ కు షెకావత్ ఫోన్

నీటి ప్రాజెక్టుల విషయంలో తెలుగురాష్ట్రాల నేతల మధ్య మాటల యద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ రంగంలోకి దిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో షెకావత్‌ ఫోన్‌లో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఎన్జీటీ ఆదేశాలపై చర్చించినట్టు సమాచారం. ఈ మేరకు ఏపీ ఎత్తిపోతల ప్రాంతానికి కృష్ణా బోర్డు బృందాన్ని పంపుతామని షెకావత్‌ తెలిపారు. పనులు జరుగుతున్నాయో? లేదో?కమిటీ పరిశీలిస్తుందని జల్ శక్తి మంత్రి చెప్పారు.   

Advertisement

తాజా వార్తలు

Advertisement