Sunday, May 5, 2024

CM Jagan:రేపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

రేపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్య‌టించ‌నున్నారు. తీరం దాటిన తర్వాత కూడా అది ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపింది. మరికొన్నిరోజుల్లో పంట చేతికొస్తుందనగా, మిగ్జామ్ విరుచుకుపడడంతో రైతాంగం భారీగా నష్టపోయింది.

పలుచోట్ల తుపాను ప్రభావంతో ప్రాణనష్టం కూడా జరిగింది. రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెట్లు విరిగిపడి విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో, సీఎం జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు పర్యటించనున్నారు. తిరుపతి జిల్లా గూడూరు, బాపట్ల జిల్లాల్లో సీఎం పర్యటన సాగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement