Monday, May 6, 2024

TS : గ్రూప్ -1 దరఖాస్తులకు ఇవాళే ఆఖ‌రు…

గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఇవాళ్టితో దరఖాస్తుల గడువు ముగుస్తుంది. సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది.

563 గ్రూప్-1 పోస్టులతో గత నెల 19న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు 2.7 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. కాగా, జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష, అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement