Monday, April 29, 2024

AP : ఏపీలో సీఎం రేవంత్ ప్రచారానికి ముహుర్తం ఫిక్స్‌

ఏపీలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ముహుర్తం ఫిక్స్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ విశాఖపట్నంలో ఉంటుందని ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఈ నెల 16 న సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ఉంటుందని ఏపీ కాంగ్రెస్ ప్రకటన చేసింది.

ఈ బహిరంగ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కాంగ్రెస్ బహిరంగ సభకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు, జాతీయ నేతలు కూడా హాజరు అవుతారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement