Wednesday, May 1, 2024

అతిపెద్ద పారిశ్రామిక సమూహంగా చందన్‌వెల్లి

తెలంగాణాకు తరలివస్తున్న గుజరాత్‌ పెట్టుబడులు.. చందన్‌వెల్లిలో వెల్‌స్పన్‌ -టె-క్స్‌-టైల్‌ యూనిట్‌ను ప్రారంభం.. ప్రస్తుతం రూ.2వేల కోట్ల పెట్టుబడులతో ప్రారంభం .. వచ్చే ఐదేళ్ళలో రూ.5వేల కోట్లతో విస్తరణ – మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఐదేళ్ల కిందట చందన్‌వెల్లి, సీతారాంపూర్‌లో ఎక్కడ వెతికినా ఒక్క పరిశ్రమ కూడా ఉండేది కాదనీ, ప్రస్తుతం వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తరలివస్తున్నాయని రాష్ట్ర ఐటీ-, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఈ ప్రాంతంలో వెల్‌స్పన్‌ యాంకర్‌గా వచ్చిన తర్వాత మైక్రోసాప్ట్‌n, అమెజాన్‌, కి-టె-క్స్‌ తదితర కంపెనీలు సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలో బుధవారం వెల్‌స్పన్‌ -టె-క్స్‌-టైల్‌ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు- చేసిన కార్యక్రమంలో కేటీ-ఆర్‌ మాట్లాడుతూ, తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం ఇక్కడే ఏర్పాటు -కాబోతుందని, గుజరాత్‌కు చెందిన అనేక సంస్థలు ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. బాలకృష్ణ గోయెంక 1985లో ఒక సంస్థను స్థాపించి, నేడు గుజరాత్‌లో 25వేల మందికి ఉపాధికి కల్పిస్తున్నారని ప్రశంసించారు. గుజరాత్‌తో పాటు- అమెరికాలోనూ ఆయన పెట్టు-బడులు పెట్టారన్నారు. తొలిసారిగా గుజరాత్‌ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో వెల్‌స్పన్‌ సిటీ-ని ఏర్పాటు- చేశారంటూ పేర్కొంటూ.. గోయెంకకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.


తెలంగాణాలోని పెట్టుబడుల అనుకూల పరిస్థితులను, ప్రోత్సాహకాలను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు ఆయన గుజరాత్‌లోని కచ్‌లో యూనిట్‌ స్థాపనను విరమించుకొని చందన్‌వెల్లిలో ఏర్పాటు- చేశారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పటికే రూ.2వేల కోట్లతో రెండు యూనిట్లు- ప్రారంభమయ్యాయని, రాబోయే ఐదేళ్ళలో రూ.3వేల నుంచి రూ.5వేలకోట్ల పెట్టబుడులు తెలంగాణలో పెడుతామని బాలకృష్ణ గొయెంకా చెప్పారని వెల్లడించారు. ఈ ప్రాంతంలో మ్యానుప్యాక్చరింగ్‌ పరిశ్రమ రావొచ్చని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, వికారాబాద్‌, మహేశ్వరం ప్రాంతాలకు వెళ్లిన సందర్భంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు మాకు ఐటీ- పరిశ్రమలు కావాలని అగుడుతున్నారని గుర్తుచేశారు. మాకు ఐటీ- పరిశ్రమ ఎందుకు రాదని? ఐటీ- రంగం అంటే కొండాపూర్‌, గచ్చిబౌలిలోనే ఉండాలా? అని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. 1000 నుంచి 1200 మంది ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఐటీ- సెంటర్‌ ఏర్పాటు- చేస్తామని బీకే గొయెంక ప్రకటించారని, ఇది శుభ పరిణామమని మంత్రి వెల్లడించారు. స్థానికంగా ఐటీ- యాక్టివిటీ- ప్రారంభమైతే చాలా మంది యువత హైదరాబాద్‌కు, బెంగళూరుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. పని లేకుండా స్థానికంగానే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు.


ఎయిర్‌పోర్ట్‌ నుంచి చందన్‌వెల్లి వరకు మెరుగైన రోడ్డు
పెట్టుబడిదారుల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఎయిర్‌పోర్ట్‌ నుంచి చందన్‌వెల్లి వరకు మెరుగైన రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణలో అద్భుతంగా పత్తి ఉత్పత్తవుతుందని, ఎక్కడో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని గొయెంకా చెప్పారని, దాంతో స్థానిక రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పారన్నారు. సౌత్‌ ఇండియా మిల్స్‌ అసోసియేషన్‌ సైతం తెలంగాణ ఉత్పత్తిని ప్రశంసించిందని కేటీ-ఆర్‌ తెలిపారు. ఐకియాతో వెల్‌స్పన్‌కు ఒప్పందం ఉందని, ఇందులో స్థానిక మహిళలను భాగస్వాములను చేస్తే.. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్‌స్పన్‌ ప్రతినిధులు చెప్పడం సంతోషకరమన్నారు.

- Advertisement -


స్కిల్‌ డెవలప్‌హెంట్‌లో మహిళలకు శిక్షణ
స్థానిక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఏర్పాటు- చేసి మహిళలు, యువతకు శిక్షణ ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ తరహాలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి… మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని కేటీ-ఆర్‌ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం నాలుగేళ్లలో పూర్తి చేసిందన్న కేటీ-ఆర్‌.. దురదృష్టవశాత్తు కొన్ని కారణాలతో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు.

కాళేశ్వరం తరహాలోనే ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టు
ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని మంత్రి కెెటీఆర్‌ ప్రకటించారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా, ప్రజల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కరెంటు- సమస్యలను ఎలా పరిష్కరించామో, పారిశ్రామిక సమూహాలు ఎలా ఏర్పాటు- చేసి పిల్లలకు ఎలా ఉపాధి అవకాశాలు పెంచుకుంటు-న్నామో.. అలాగే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకుందామన్నారు. అంతకు ముందు వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్‌ బాలకృష్ణ గొయెంక మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టు-బడులు పెట్టి చందన్‌ వెల్లిని వెల్‌స్పన్‌ వ్యాలీగా మారుస్తామని చెప్పారు. మంత్రి కేటీ-ఆర్‌ విజన్‌.. చందన్‌వెల్లి టూ సిలికాన్‌ వ్యాలీ అన్న కేటార్‌.. సీఎం కేసీఆర్‌ అద్భుత దార్శనికతతో ముందుకెళ్తున్నారంటూ ప్రశంసించారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement