Wednesday, May 1, 2024

HYD: కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో చికోటి ప్రవీణ్ ప్రత్యేక పూజలు

కర్మన్ ఘాట్, సెప్టెంబర్ 12 (ప్రభ న్యూస్) : కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో చికోటి ప్రవీణ్ కుమార్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు చికోటి ప్రవీణ్ కుమార్, ఆయన బృందాన్ని ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు చికోటి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తానని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే బరిలో పోటీల్లో ఉంటారా అని అడగ్గా పార్టీ ఏది ఆదేశిస్తే అది చేస్తానని తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో పూజలు చేసిన అనంతరం భారీ ర్యాలీగా బాణసంచా, డప్పు వాయిద్యాలతో ఎల్బీనగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం నాంపల్లి రాష్ట్ర కార్యాలయానికి చేరుకోనున్నట్లు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు చేసిన వ్యాఖ్యలను చికోటి ప్రవీణ్ కుమార్ ఖండించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement