Thursday, May 2, 2024

TS: ముఖ్య‌మంత్రి బ‌స్సులో… మాజీ ముఖ్య‌మంత్రి హెలికాప్ట‌ర్లో …

సిత్రమైన సీన్ ఒకటి తెలంగాణలో ఈ రోజు చోటు చేసుకుంటోంది. వ్యూహం అనునుకోండి. ఎత్తుకు పైఎత్తు అనుకోండి. మొత్తంగా ఒకే రోజున అధికార కాంగ్రెస్.. విపక్ష బీఆర్ఎస్ లకు సంబంధించి కీలకమైన ప్రోగ్రాంలను నేడు చేప‌ట్టారు. రెండు కూడా నీటితో ముడిపడిన అంశాలే.

కాంగ్రెస్ గోదావరి మీద నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలోని లోపాల్ని సమీక్షించేందుకు.. గత ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపే ప్రోగ్రాంను చేపడితే.. కృష్ణా జలాలు దానిపై నిర్మించిన ప్రాజెక్టుల పర్యవేక్షణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపేందుకు భారీ సభను ఏర్పాటు చేశారు.

ఈ రెండు కార్యక్రమాలు రాజకీయంగా హైఓల్టేజ్ అన్నది తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ రెండు వేదికలు రాజధాని హైదరాబాద్ కు దూరంగా ఉండేవే. నల్గొండతో పోలిస్తే మేడిగడ్డ మరింత దూరం. అయితే ఈ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వీలుగా ముఖ్యమంత్రి, ధాన ప్రతిపక్ష నేత ఎంచుకుంటున్న రవాణా సౌకర్యం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు తన మంత్రులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస్సులో ప్రయాణం అయ్యారు.. నాలుగు బ‌స్సుల‌లో సిఎం,అయ‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రులు, కాంగ్రెస్ ఎంఐఎం,సిపిఐ ఎమ్మెల్యేలు మేడిగ‌డ్డ‌కు ప‌య‌న‌మ‌య్యారు… నాలుగు గంటలకు పైనే రోడ్డు ప్ర‌యాణం కొన‌సాగనుంది.. తిరిగి వచ్చే టప్పుడు కూడా ఆయన బస్సులోనే రానున్నారు.

అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం హెలికాఫ్టర్‌లో నల్గొండ సభకు హాజరు కానుండ‌టం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా అధికారంలో ఉన్న వారు హెలికాఫ్టర్ లో విపక్షంలో ఉన్న వారు రోడ్డు మార్గాన ప్రయాణించటం తెలిసిందే. అందుకు భిన్నంగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న తాజా సీన్ ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement