Sunday, May 19, 2024

Chennur – వాగ్దానాలను విస్మరించిన ప్రభుత్వాన్ని తరిమేయాలి – కాంగ్రెస్ అభ్యర్థి వివేక్

చెన్నూర్ నవంబర్ 6(ప్రభ న్యూస్) ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం నీళ్ళు నిధులు నియామకాల పేరుతో ప్రజలను మోసము చేసిన కెసిఆర్ ప్రభుత్వాన్ని తరిమి వేయాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ఎంపి చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇందారం క్రాస్ నుంచి చెన్నూరు నియోజకవర్గ కేంద్రం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీ లో వివేక్ పాల్గొన్నారు. అనంతరం స్థానిక పాత బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ప్రొఫెసర్ కోదండరాం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు జుర్ణలిస్ట్ విఠల్ తో కలిసి ప్రసంగించారు.

రాష్ట్ర ఏర్పాటు అనంతరం కెసిఆర్ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి మోసానికి గురి చేశారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రి డిజైన్ పేరుతో కోట్లు దండుకున్నారని స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ పై వందల కేసులు ఉంటే వేయిల కోట్లు ఎలా సంపాదించాడో చెప్పాలని ప్రశ్నించారు. కమిషన్లు కొరకు కుటుంబ పాలన సాగిస్తున్న కెసిఆర్ ప్రభుత్వన్ని జరుగనున్న ఎన్నికల్లో ప్రజలు తరిమి కొట్టడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి మాజీ వైస్ ఛైర్మన్ మూల రాజిరెడ్డి, సీనియర్ న్యావాదులు శరత్, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement