Saturday, May 18, 2024

నకిలీ పత్తి విత్తన ముఠాకు చెక్‌.. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరుకు బీటీ3 రకం నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న కర్ణాటకకు చెందిన ముఠాను సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధి పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు. శంషాబాద్‌ ఎస్వోటీ పోలీసులతోపాటు షాద్‌నగర్‌ నందిగామ మండల పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ ముఠానుంచి రూ.80లక్షల విలువైన నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

కర్ణాటకకు చెందిన పాత నేరస్థుడు ఫణీంద్రపు వెంకటేశ్వరరావుతోపాటు గంగారెడ్డి, పాపిరెడ్డిగారి రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మాట్లాడుతూ… నిందితుల నుంచి మారుతి డిజైర్‌ కారుతోపాటు కర్ణాటకకు చెందిన డీసీఎం వ్యాన్‌, నాలుగు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులను ఆయన అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement