Monday, May 6, 2024

Hyderabad: చాంద్రాయాణ‌గుట్ట ఫ్లై ఓవ‌ర్ ప్రారంభోత్స‌వం వాయిదా.. ఉద్ర‌క్త ప‌రిస్థితులే కార‌ణం!

హైదరాబాద్​ సిటీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చాంద్రాయ‌ణ‌గుట్ట ఫ్లై ఓవ‌ర్ ప్రారంభోత్స‌వాన్ని వాయిదా వేసిన‌ట్టు ఇవ్వాల (మంగ‌ళ‌వారం) అధికారులు ప్ర‌క‌టించారు. ఈ నెల 27వ తేదీన ఈ ఫ్లై ఓవ‌ర్‌ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తార‌ని ఓ ట్వీట్ ద్వారా వెల్ల‌డించారు.

ఇక‌.. దీనికి సంబంధించి నిన్న మంత్రి కేటీఆర్ సంతోషంగా ఓ ట్వీట్ చేశారు. అదేంటంటే.. ‘‘హైద‌రాబాద్ సిటీ డెవ‌ల‌ప్‌మెంట్‌లో భాగంగా అవ‌స‌ర‌మైన చోట ప్ర‌భుత్వం ఫ్లైఓవ‌ర్ల‌ను నిర్మిస్తోంది. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ట్రాఫిక్ క‌ష్టాలు ఉండొద్ద‌నే ఉద్దేశంతో ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో అండ‌ర్ పాస్‌లు, ఫ్లై ఓవ‌ర్లు, లింక్ రోడ్ల‌ను టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం నిర్మించింది. దీంతో అటు ప్ర‌జ‌లు, ఇటు వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డ‌కుండా గ‌మ్య‌స్థానాల‌కు చేరుకుంటున్నారు. ఇక వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల అభివృద్ధి కార్య‌క్ర‌మం(SRDP) కింద నిర్మించిన చాంద్రాయ‌ణ‌గుట్ట ఫ్లై ఓవ‌ర్‌ను మంగ‌ళ‌వారం ప్రారంభిస్తున్నాం” అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement