Sunday, April 28, 2024

మంత్రి తలసాని కుమారుడిపై కేసు న‌మోదు

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయి కిర‌ణ్‌ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీపావళి సందర్భంగా హైద‌రాబాద్‌లోని ఖైరతాబాద్‌లో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో కిరణ్ యాదవ్ పాల్గొని, తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన కారు ఓ వ్య‌క్తిని ఢీకొట్టింది. సంతోష్‌(32) ఎడమ పాదం పైనుంచి మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న కారు టైరు వెళ్లింది. దీంతో సంతోష్ ను ఆయనను వెంటనే కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తలసాని సాయికిరణ్‌ యాదవ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సైఫాబాద్‌ పోలీసులు తెలిపారు.   


Advertisement

తాజా వార్తలు

Advertisement