Monday, April 29, 2024

TS: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు

బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదైంది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారని ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియామవళికి వ్యతిరేకంగా వెంకటరామిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలక్షన్ ఫ్లయింగ్ స్కాడ్ ఫిర్యాదు మేరకు వెంకటరామిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, ఆదివారం అర్థరాత్రి ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఓ భవనంలో రహస్యంగా సమావేశం పెట్టారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. వెంకటరామిరెడ్డి ఉద్యోగులతో భేటీ అయిన భవనానికి తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు మేరకు వెంకటరామిరెడ్డిపై కేసు నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement