Monday, April 29, 2024

తీన్మార్ మల్లన్న పై కేసు

తీన్మార్ మల్లన్న ( నవీన్ కుమార్) పై చిలకలగూడ పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ లోని సీతాఫల్ మండి ప్రాంతంలో మారుతి సేవా సమితి పేరుతో జ్యోతిష్యాలయం నిర్వహిస్తున్న లక్ష్మీకాంత శర్మ  ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. తీన్మార్ మల్లన్న, రూ. 30 లక్షలు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారని, తాను ఇవ్వకపోవడంతో మరుసటి రోజు నుంచి తన క్యూ న్యూస్ ఛానెల్ లో అవాస్తవ కథనాలను ప్రసారం చేశారని లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదు చేశారు. కేసు ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement