Sunday, April 28, 2024

Road accident: కారు బీభత్సం…ద్విచ‌క్ర వాహ‌నంను ఢీ.. ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు

కేపీహెచ్‌బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్ రాంగ్ రూట్‌లో అతివేగంగా నడుపుకుంటూ వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు.

ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కేపీహెచ్‌బీలో మాజీ మంత్రి మేనల్లుడు అగ్రజ్‌ మద్యం మత్తులో రెచ్చిపోయాడు. నలుగురు స్నేహితులతో సోమవారం తెల్లవారుజాము వరకు ఫుల్లుగా మద్యం సేవించి కారును డ్రైవ్‌ చేశారు. ఈ క్రమంలో రాంగ్‌ రూట్‌లో కారును నడిపి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టారు. దీంతో, బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement