Friday, May 10, 2024

Breakiing: క‌ర్నాట‌క‌లో కారు ప్ర‌మాదం.. హైద‌రాబాద్‌కు చెందిన అయిదుగురు మృతి

క‌ర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లా బంగూర్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. కారు కంటైన‌ర్‌ను ఢీకొట్ట‌డంతో ఈ యాక్సిడెంట్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో ఓ చిన్నారితో సహా ఐదుగురు చ‌నిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు హైదరాబాదు బేగంపేటకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవార‌ని తెలుస్తోంది. మృతుల్లో గిరిధర్ (45), అనిత (30), ప్రియ (15), మహేశ్ (2), జగదీశ్ (35) ఉన్నారు. వీరంతా కలబురిగి జిల్లా గంగాపూర్ దత్తాత్రేయ ఆలయ సందర్శనకు కారులో వెళ్తుండ‌గా ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement