Saturday, May 4, 2024

Campaign – మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం……

మహేశ్వరం అర్బన్ నవంబర్ 12 ప్రభ న్యూస్ – రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గంను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి కోట్లాది రూపాయల ప్రత్యేక నిధులతో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను పేద ప్రజలకు ఇచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ 12వ డివిజన్ కార్పొరేటర్ యాతం పవన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మామిడి పల్లి రంగనాయకుల కాలనీలో కాలనీ వాసులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ ఎస్ పార్టీ గెలుపు నల్లేరుపై నడకేనని అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోట్లాది రూపాయల ప్రత్యేక నిధులతో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించటం జరిగిందన్నారు.మంత్రికి ఈ కార్యక్రమం లో స్థానిక తెలంగాణ ఉద్యమ నాయకులు గోవిందు భాస్కర్,12వ డివిజన్ అధ్యక్షులు గాయాల శ్రీరామ్,మైనారిటీ అధ్యక్షులు ఖాజా, కార్మిక విభాగం అధ్యక్షులు చంద్రశేఖర్ ,12వ డివిజన్ యాత్ అధ్యక్షులు ఓర్సు శ్రీను నాయకులు లింగం. పాల్గొంటారు

Advertisement

తాజా వార్తలు

Advertisement