Friday, April 26, 2024

ఖమ్మం జిల్లా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి క్యాబినేట్ ఆమోదం

ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర క్యాబినేట్ గురువారం ఆమోదం తెలిపింది. అర్హులైన జర్నలిస్ట్ లందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తామన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన మాట నిలుపుకున్నారు. ఇప్పటికే ఖమ్మం నగర జర్నలిస్ట్ లకు ఇళ్ళ పట్టాలు ఇస్తామ నిరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ హామీ మేరకు 5 ఎకరాల్లో జర్నలిస్ట్ లకు ఇంటి స్థలం ఇవ్వాలని గతంలో మంత్రి పువ్వాడ సారధ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక Go జారీ చేసింది. . 5 ఎకరాలు స్థలం సరిపోదని, అర్హులైజర్నలిస్ట్ లందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఅర్ కి ఖమ్మం ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్ జాతీయ ఆవిర్భావ సభలో ఇచ్చిన హామీ మేరకు హైద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఅర్ ఆమోదం తెలిపారు. ఇప్పటికే స్థలం గుర్తించామని, ప్రతి జర్నలిస్టుకూ 200 గజాలు ఇవ్వనున్నామని సీఎం కేసీఆర్ స్పష్టంగా తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పని చేసే జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలు పంపిణీ చేస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జర్నలిస్టు లకు ఇళ్ళ స్థలాలు ఇస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి టియుడబ్ల్యూజేఐజెయు జర్నలిస్టు యూనియన్ ఖమ్మం జిల్లా కమిటీ, ఖమ్మం జిల్లా ఎలక్ట్రానిక్ కమిటీ, ఖమ్మం నగర కమిటీ, ఖమ్మం ప్రెస్ క్లబ్ కమిటీల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement