Friday, May 3, 2024

కారును ఢీకొని లోయలో పడిన ఆర్టీసీ బస్సు

పెద్దపల్లి జిల్లా మంథనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎక్లాస్‌పూర్‌ గాడిదులగండిగుట్ట వద్ద ఓ ఆర్టీసీ బస్సు రోడ్డుపక్కన లోయలో పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 16 మందికి తీవ్ర గాయాలైయ్యయి. పరకాల డిపోకు చెందిన బస్సు బెల్లంపల్లి నుంచి హన్మకొండ వెళ్తుండగా గాడిదుల గండి వద్ద ఓ కారును ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో కారులో ఉన్న వ్యక్తి మరణించగా, బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 16 మందికి స్వల్పగాయాలయ్యాయి .సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement