Monday, April 29, 2024

TS : ఓ వైపు బడ్జెట్‌… మ‌రోవైపు విజిలెన్స్ త‌నిఖీలు…

ఖ‌మ్మం న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్నారు. నగరపాలక సంస్థ చేపట్టిన సివిల్ పనులతో సహా పబ్లిక్ హెల్త్, పంచాయితీ రాజ్, ఆర్టీసీ కొత్త బస్టాండ్, గోళ్లపాడు ఛానల్ పనుల పునరుద్ధరణ వంటి వాటికి సంబంధించి డాక్యుమెంట్లు సేకరిస్తున్నట్లు వరంగల్ రేంజ్ విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ బాలకోటి తెలిపారు.

- Advertisement -

ఖమ్మం నగరపాలక సంస్థలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఒకవైపు బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే మరోవైపు విజిలెన్స్ తనిఖీలు జరగుతుండటంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గత ప్రభుత్వం హయాంలో మూడేళ్ళుగా జరిగిన పనుల జాబితా సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు. మూడు బృందాలుగా విడిపోయిన తమ సిబ్బంది నగరపాలక సంస్థ కార్యాలయం ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ప్రధాన సెక్షన్లలో రికార్డులను విస్తృతంగా సేకరిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement