Friday, May 10, 2024

Brutal Murder … రోడ్డు పక్కన సగం కాలిన మహిళ శవం…హడలిపోయిన జనం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం తుంకుంట గ్రామ శివారులో శుక్రవారం నాడు ఉదయం తుంకుంట గ్రామ శివారులో రోడ్డు పక్కన గుర్తుతెలియని మహిళ కాలిన శవం పడి ఉండడం ఆ ప్రాంతంలో ప్రజలు హడలెత్తిపోయారు. దాదాపుగా ముఖం శరీర భాగాలు కాలిపోయాయి శవం గుర్తు పట్టని విధంగా ఉంది.

సుమారు 20 సంవత్సరాల లోపు గల మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి కాల్చి వేశారా లేదా సజీవంగా దహనం చేశారా అనే విషయాలపై స్థానిక పోలీసులు ఆరా తీస్తున్నారు. శవాన్ని పోస్ట్ మార్టమ్ కోసం హాస్పటల్ కు తరలించారు.. ఆమె వివరాలను సేకరించే పనిలో పోలీసులు పడ్డారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement