Friday, May 17, 2024

TS | నిజామాబాత్ జిల్లాలో దారుణ హత్య..

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లాలో ఖిల్లా రోడ్డులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాడుబడిన భవనంలో ఓ వ్యక్తిని హతమార్చిన దుండగులు తగలబెట్టారు. ఇవ్వాల (సోమవారం) మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రెండో టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు అధికారులు దర్యాఫ్తు చేపట్టారు.

మరో వ్యక్తి షేక్ అహ్మద్ కాలిన గాయాలతో ఉండగా అతనిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు నగరానికి చేరుకున్న ముఖిద్ గా పోలీసులు అనుమా నిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సంఘటన స్థలాన్ని ట్రైనీ DCP చైతన్య, ఏసిపి కిరణ్ కుమార్, టౌన్ సిఐ నరహరి పరిశీలించారు. వ్యక్తి హత్య చేసి ఎందుకు తగల బెట్టారు..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement