Monday, May 13, 2024

Khammam :పోంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన‌ బిఅర్ఎస్ పార్టీ సర్పంచ్ లు

పినపాక,నవంబర్ 9,(ప్రభ న్యూస్): భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక మండలంలోని పలు సర్పంచ్ లు వలసల బాట పట్టారు. బిఅర్ఎస్ పార్టీ లోని కోందరి రాజకీయ మండల స్థాయి ‌ముఖ్య నాయకుల,వ్యవహర శైలి నచ్చక పార్టీ మారినట్లు విశ్వసనీయ సమాచారం. భూపాల పట్నం సర్పంచ్ కోర్సా క్రిష్ణంరాజు, కోలేటి భవాని శంకర్ శిష్యుడు, పినపాక సర్పంచ్ గోగ్గల నాగేశ్వరరావుతో పాటు మరికొందరు ఖమ్మం మాజీ ఎంపి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బిఅర్ఎస్ పార్టీ మండల స్థాయి నాయకుల‌ వ్యవహర శైలి విధానం‌, వారి పై అసంతృప్తి వల్లే కాంగ్రెస్ పార్టీ లో చేరామని తెలిపారు. ఇంకా కొంతమంది సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నట్లు తెలిసింది. చేరికల కార్యక్రమం లో ఉమ్మడి ఖమ్మం సొసైటీ డైరెక్టర్ తుళ్ళూరు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement